పక్కాగా పవన్ ప్రణాళిక

Update: 2018-05-14 07:55 GMT

తిరుమల పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ ప్రణాళికను పక్కాగా సిద్ధం చేసుకున్నారు. ఆయన చేపట్టనున్న బస్సుయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ కు కూడా తుదిరూపు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ మేరకు తన భవిష్యత్ కార్యాచరణ ఎప్పుడు ప్రకటిస్తారా అని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఆయన తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత రాజకీయాలపై మాట్లాడతారని అందరూ భావించినా, పవన్ మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయాలపై మీడియా పలు ప్రశ్నలు వేయగా, దేవుడి సన్నిదిలో రాజకీయాలపై మాట్లాడటం సరికాదని, మీరు కూడా అడగవద్దని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆయన కార్యాచరణపై సస్పెన్స్ కొనసాగుతోంది.

స్థానిక ఆలయాలను దర్శించనున్న పవన్.....

ఆదివారం శ్రీవారి దర్శనం పూర్తిచేసుకుని హంపీ మఠంలో పవన్ ఏకాంతంగా గడిపారు. సోమవారం ఆయన జాపాలి ఆంజనేయస్వామి ఆలయంతో పాటు స్థానిక ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం తిరుమల పర్యటన పూర్తి చేసుకుని బయలుదేరనున్నారు. చిత్తూరు సమీపంలోని రోడ్డు పనుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులను, రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం తన బస్సుయాత్ర వివరాలు ప్రకటించడంతో పాటు రాజకీయ అంశాలపై మట్లాడనున్నట్లు తెలిసింది.

Similar News