కార్యకర్తలతో జనసేనాని..!

Update: 2018-05-21 07:28 GMT

45 రోజుల సుదీర్ఘ జనపోరాట యాత్రలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టాసారించారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. మొదట ఆయన ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇచ్ఛాపురం రోటరీ క్లబ్ లో జనసేన కార్యకర్తలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యకక్రమాలపై పవన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల అభిప్రాయాలను, సూచనలను కూడా పవన్ తెలుసుకున్నారు. కార్యకర్తలు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కవిటి, కంచిలి, సోంపేట మండలాల కార్యకర్తలు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News