కధువా అత్యాచార ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చలించి పోయారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పవన్ కల్యాణ్ మరికాసేపట్లో మౌనదీక్షకు దిగనున్నారు. కథువాలో బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా పవన్ మరికాసేపట్లో నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మౌనదీక్షకు దిగనున్నారు.