బాబుకు వయసయిపోయింది...!!

Update: 2018-11-24 06:21 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారాలోకేష్ కుతంత్రాలను ఆపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. వరుసగా తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం ఒక ఇసుక లారీ తన కాన్వాయ్ లో ఉన్న తన బౌన్సర్ల వాహనాన్ని ఢీకొట్టిందని, ఇటీవల తమ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ వాహనాన్ని కూడా ఇసుక లారీ ఢీకొట్టడంపై పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. తాను జగన్ లాగా ఊరుకునే వాడిని కానని అధికార పార్టీ గుర్తుంచుకోవాలన్నారు.

భద్రత పెంచాలని కోరినా.....

జగన్ పై దాడి జరిగితే జగన్ లా తాను పారిపోయే వాడినికానని, తాను జనం మధ్యలోనే ఉండి పోరాడతానని పవన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయసు పెరిగిపోయిందని, ఆయన ఇక ముఖ్యమంత్రిగా పనికిరారని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అవసరమైతే చంద్రబాబు జగన్ తో కూడా పొత్తు పెట్టుకునేందుకు వెనుకాడరన్నారు. నాదెండ్ల మనోహర్ కు భద్రత పెంచాలని ఎన్నిరోజుల నుంచో కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమ వారిపై జరుగుతున్న వరుస ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఏమైనా జరిగితే అందుకు డీజీపీయే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Similar News