తెలంగాణకు వెళ్తే ఆంధ్రావాళ్లను కొడుతున్నారు

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు వ్యతిరేకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇవాళ భీమవరంలో జరిగిన ప్రచార [more]

Update: 2019-03-22 11:44 GMT

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు వ్యతిరేకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇవాళ భీమవరంలో జరిగిన ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ఇక్కడ మనం కులాల వారీగా కొట్టుకుంటున్నామని, తెలంగాణకు వెళ్తే మనల్ని ఆంధ్రా వాళ్లు అని కొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయనకు ఏమి రాజకీయ ప్రయోజనం కలుగుతుందో కానీ ఆయన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైరవుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా, తెలంగాణ అనే బేధాలేమీ లేకుండా తెలంగాణలో స్థిరపడ్డ వారంతా సంతోషంగా ఉంటున్నారని, ఒక్క ఘటన కూడా ఆంధ్రా వారిపై దాడి జరిగినట్లు ఎక్కడా నమోదు కాలేదని, అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం సరికాదంటున్నారు.

Tags:    

Similar News