రాజధానికి పవన్

ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. గత కొద్ది రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులకు పవన్ కల్యాణ్ మద్దతు తెలపనున్నారు. రాజధానిని అమరావతిలోనే [more]

Update: 2020-02-15 01:54 GMT

ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. గత కొద్ది రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులకు పవన్ కల్యాణ్ మద్దతు తెలపనున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం పదిగంటలకు పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి రాజధాని ప్రాంత గ్రామాలకు వెళతారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, అనంతవరం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతు దీక్ష శిబిరాలను పవన్ కల్యాణ్ సందర్శిస్తారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన వారిని పవన్ కల్యాణ‌ పరామర్శిస్తారు.

Tags:    

Similar News