కర్నూలు లో పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలులో పర్యటిస్తున్నారు. ఆయన కర్నూలులో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సుగాలి ప్రీతి కేసులో అసలన దోషులను శిక్షించాలని పవన్ కల్యాణ‌్ డిమాండ్ [more]

Update: 2020-02-12 11:26 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలులో పర్యటిస్తున్నారు. ఆయన కర్నూలులో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సుగాలి ప్రీతి కేసులో అసలన దోషులను శిక్షించాలని పవన్ కల్యాణ‌్ డిమాండ్ చేస్తున్నారు. ప్రీతి మృతి విషయంలో దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని, దోషులను రక్షించే ప్రయత్నం జరుగుతుందంటూ పవన్ కల్యాణ్ భారీ ర్యాలీని చేపట్టారు. విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షంచాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. హత్య, అత్యాచారం 2015లో జరిగితే ఇప్పటి వరకూ నిందితులను అరెస్ట్ చేయకపోగా ఆత్మహత్య చేసుకుందని తప్పుడు నివేదికలు ఇస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి ప్రభుత్వం అసలైన నిందితులను అరెస్ట్ చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ కి అప్పగించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News