పవన్ రాజధాని ప్రాంతంలో..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈనెల 15వ తేదీన పవన్ పర్యటన ఉంటుందని జనసేన వర్గాలు వెల్లడించాయి. రాజధాని కోసం భూములిచ్చిన గ్రామాలన్నింటిలోనూ [more]

Update: 2020-02-08 11:52 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈనెల 15వ తేదీన పవన్ పర్యటన ఉంటుందని జనసేన వర్గాలు వెల్లడించాయి. రాజధాని కోసం భూములిచ్చిన గ్రామాలన్నింటిలోనూ పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రైతులకు సంఘీభావం తెలపనున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతం రైతులు రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ గత యాభై రోజులుకు పైగానే దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. అలాగే ఈ నెల 12, 13 వ తేదీల్లో పవన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు.

Tags:    

Similar News