నేను కూడా రెడీ

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ కూడా రాజధాని ఉద్యమంలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఈరోజు జగరబోయే పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీలో అమరావతి ఉద్యమంపై నిర్ణయం తీసుకోనున్నారు. [more]

Update: 2020-01-20 02:32 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ కూడా రాజధాని ఉద్యమంలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఈరోజు జగరబోయే పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీలో అమరావతి ఉద్యమంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ పవన్ కల్యాణ్ రైతులకు సంఘీభావం తెలిపారు. జేఏసీ లో జనసేన భాగస్వామిగా కూడా ఉంది. పలువురు జనసేన నేతలు దీక్షలు కూడా చేశారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం నేరుగా ఆందోళనలకు దిగలేదు. ఈరోజు మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీలో రాజధాని అంశంపై స్పష్టత వచ్చాక పవన్ కల్యాణ్ తన కార్యాచరణను ప్రకటించే అవకాశముంది. ఈరోజు జరగబోయే పీఏసీలో దీనిపైనే చర్చించ నున్నారు. దీంతో పాటు బీజేపీతో జనసేన పొత్తు అవసరంపైన కూడా నేతలకు పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో వివరించనున్నారు.

Tags:    

Similar News