భయపడేది లేదు… సహనం కోల్పోతున్నాం

రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం సమస్యగా మారిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టింగ్ పెట్టినా [more]

Update: 2021-01-22 06:49 GMT

రాష్ట్రంలో శాంతిభద్రతల అంశం సమస్యగా మారిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టింగ్ పెట్టినా అరెస్ట్ చేస్తున్నారని పవన్ కల్యాణ‌్ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వాళ్లు ఏవైనా మాట్లాడవచ్చు కాని, ఇతర పార్టీల నేతలు మాట్లాడితే భౌతిక దాడులకు దిగుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. శాంతిభద్రతలు రాష్ట్రంలో క్షీణించాయని చెప్పారు. భవిష్యత్ లో వీటిపై కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాము ఇప్పటికే సహనాన్ని కోల్పోతున్నామని చెప్పారు.

Tags:    

Similar News