నేడు బందరులో పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ఆయన నివార్ తుపాను బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించనున్నారు. నివార్ తుపాను [more]

Update: 2020-12-28 02:58 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు మచిలీపట్నంలో పర్యటించనున్నారు. ఆయన నివార్ తుపాను బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించనున్నారు. నివార్ తుపాను తో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారని, వారికి ఇంతవరకూ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారు. రైతులకు తక్షణం 35 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ‌్ బందర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    

Similar News