వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి.. పవన్ డిమాండ్

మూడు రాజధానుల ఏర్పాటుకు జనసేన వ్యతిరేకమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాము తొలి నుంచి రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుకున్నామన్నారు. పవన్ [more]

Update: 2020-08-02 14:05 GMT

మూడు రాజధానుల ఏర్పాటుకు జనసేన వ్యతిరేకమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాము తొలి నుంచి రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుకున్నామన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన రాజధాని రైతులకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం చేసినందుకు వైసీీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ పేరిట వైసీపీ ప్రభుత్వం మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిందని పవన్ కల్యాణ్ అన్నారు.

Tags:    

Similar News