పవన్ కు తమిళ్ సై అభినందనలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అభినందనలు తెలిపారు. తమిళనాడులో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన మత్స్యకారులు [more]

Update: 2020-03-31 04:47 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అభినందనలు తెలిపారు. తమిళనాడులో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయారు. దాదాపు 30 మంది మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి తమిళనాడు తీరప్రాంతంలో చిక్కుకుపోయారు. దీంతో పవన్ కల్యాణ్ శ్రీకాకుళం కలెక్టర్ ను మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో పళనిస్వామి 30 మంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులకు తమిళనాడు ప్రభుత్వం భోజన, వసతి కల్పించింది. దీనికి తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ పవన్ కల్యాణ్ కు అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News