పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మీటింగ్ కు దూరంగా

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకూడదని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల [more]

Update: 2021-04-02 01:54 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకూడదని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తూ నీలం సాహ్ని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి హాజరవ్వకూడదని జనసేన నిర్ణయించింది. తాము ఇప్పటికే కోర్టులో దీనిపై కేసులు వేసినందున, ఆల్ పార్టీ మీటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది.

Tags:    

Similar News