నేడు విచారణ.. అంతా ఉత్కంఠ

పంచాయతీ ఎన్నికలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విచారణను జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ [more]

Update: 2021-01-25 01:18 GMT

పంచాయతీ ఎన్నికలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విచారణను జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ తో కూడిన ధర్మాసనం జరపనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నికలను నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నానానికి విచారణనకు వచ్చే అవకాశముంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోననన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Tags:    

Similar News