ఎన్నికలపై నేడు సుప్రీంకోర్టులో?

పంచాయతీ ఎన్నికలపై నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు దీనిపై విచారణ జరిగే అవకాశముంది. [more]

Update: 2021-01-22 01:43 GMT

పంచాయతీ ఎన్నికలపై నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశముంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు దీనిపై విచారణ జరిగే అవకాశముంది. హైకోర్టు ధర్మాసనం పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం సమన్వయంతో కలసి పనిచేసుకోవాలని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నేడు విచారణ జరిగే అవకాశముంది.

Tags:    

Similar News