జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే…??

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇవాళ బాధ్యతలు తీసుకున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మొదటిరోజే పని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని నలుగురు కీలక ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ [more]

Update: 2019-05-30 10:54 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇవాళ బాధ్యతలు తీసుకున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మొదటిరోజే పని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని నలుగురు కీలక ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఐదేళ్లుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంవోలో కీలకంగా వ్యవహరించిన సతీష్ చంద్ర, సాయి ప్రసాద్, గిరిజా శంకర్, వి.రాజమౌళిను బదిలీ చేశారు. వీరిని సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇక, ముఖ్యమంత్రి కార్యదర్శిగా ధనుంజయరెడ్డిని నియమించారు. ఆయన ఇప్పటివరకు పర్యటక శాఖలో పనిచేస్తున్నారు.

Tags:    

Similar News