ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న కేసులు.. ఆ మూడు జిల్లాల్లోనే?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా కరోనా పాజిటివ్ కేసులు 82 నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ [more]

Update: 2020-04-28 06:21 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా కరోనా పాజిటివ్ కేసులు 82 నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259కు చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 970 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 258 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 31 మంది మృతి చెందారు. అత్యధికంగా ఈరోజు కూడా కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 332కు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది.

Tags:    

Similar News