భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా భారత్ లో 15,223 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 151 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

Update: 2021-01-21 05:49 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా భారత్ లో 15,223 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 151 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,10,883 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,52,869 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,92,308 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,02,65,706 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News