ఏపీలో 21కి పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విశాఖపట్నంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీకి వెళ్లి ఒక కార్యక్రమంలో [more]

Update: 2020-03-30 02:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విశాఖపట్నంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీకి వెళ్లి ఒక కార్యక్రమంలో పాల్గొనడటంతో ఈ వ్యాధి ఏపీలో నలుగురికి సోకింది. విశాఖలో లండన్ నుంచి వచ్చిన యువకుడి కుంటుంబంలో నలుగురికి కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించింది. ఏపీలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసులు 21గా నమోదయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రతి రోజు సమీక్షలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

Tags:    

Similar News