నేడు 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నేడు తొమ్మిది మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ [more]

Update: 2021-08-31 04:42 GMT

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నేడు తొమ్మిది మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇటీవల కొలీజియం తొమ్మిది మంది వివిధ హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో ఈరోజు తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేస్తారు.

Tags:    

Similar News