అన్ని జాగ్తత్తలు తీసుకున్నాం.. స్వేచ్ఛగా ఓటేయ్యండి

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. మూడో దశ పోలింగ్ [more]

Update: 2021-02-14 06:28 GMT

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. మూడో దశ పోలింగ్ లో సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టామని ఆయన వివరించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు. తాము జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే పోలింగ్ శాతం పెరిగిందని ఆయన తెలిపారు. ప్రజలంతా మూడో దశ పోలింగ్ లో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News