నిమ్మగడ్డపై మరో పిటీషన్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించవద్దంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది. రిటైర్డ్ ఐజీ సుందర్ కుమార్ దాస్ హైకోర్టులో పిటీషన్ [more]

Update: 2020-06-10 02:44 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించవద్దంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది. రిటైర్డ్ ఐజీ సుందర్ కుమార్ దాస్ హైకోర్టులో పిటీషన్ వేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమర్ ను నియంత్రించాలని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో గవర్నర్ దే విచక్షణాధికారమని, ఇందులో రాష్ట్ర కేబినెట్ కు ఎటువంటి అధికారాలు లేవని ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ఉందని, అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News