బ్రేకింగ్ : నిమ్మగడ్డకు నేడు కూడా దొరకని రిలీఫ్

రాష్ట్ర ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై విచారణను వచ్చే సోమవారం నాటికి హైకోర్టు వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ [more]

Update: 2020-04-29 07:21 GMT

రాష్ట్ర ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై విచారణను వచ్చే సోమవారం నాటికి హైకోర్టు వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై నేడు కూడా విచారణ జరగాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల విచారణ సాధ్యం కాకపోవడంతో దీనిపై విచారణను వచ్చే సోమవారం నాటికి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. సోమవారం వాదనలను నేరుగా వింటామని హైకోర్టు పేర్కొంది. న్యాయవాదులకు, పిటీషన్లకు ప్రత్యేక పాస్ లు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.

Tags:    

Similar News