ఏపీలో కొత్త కరోనా వైరస్ కలకలం

ఏపీలో కొత్త కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. ఇటీవల కాలంలో యూకే నుంచి దాదాపు 1012 మంది ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. కానీ వారిలో 848 మందిని [more]

Update: 2020-12-26 04:40 GMT

ఏపీలో కొత్త కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. ఇటీవల కాలంలో యూకే నుంచి దాదాపు 1012 మంది ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. కానీ వారిలో 848 మందిని మాత్రమే ట్రేస్ చేయగలిగారు. వీరందరినీ క్వారంటైన్ లో ఉంచారు. వీరి రక్తనమూనాలను పూనేలోని ల్యాబ్ కు పంపారు. అలాగే చిత్తూరు జిల్లాలోనే 38 మంది యూకే నుంచి జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరందరినీ ట్రేస్ చేసే పనిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. వీరందరికీ పాత కరోనా వైరస్ ఉందా? లేదా? కొత్త కరోనా వైరస్ సోకిందా? అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News