ర‌విప్ర‌కాష్ ఔట్‌… టీవీ9కు కొత్త సీఈఓ

టీవీ9లో ప్ర‌క్షాళ‌న దిశ‌గా కొత్త యాజ‌మాన్యం అలంద మీడియా సంస్థ అడుగులు వేసింది. సంత‌కాలు పోర్జ‌రీ చేసి యాజ‌మాన్యాన్ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డంతో పాటు నిధులు [more]

Update: 2019-05-10 12:19 GMT

టీవీ9లో ప్ర‌క్షాళ‌న దిశ‌గా కొత్త యాజ‌మాన్యం అలంద మీడియా సంస్థ అడుగులు వేసింది. సంత‌కాలు పోర్జ‌రీ చేసి యాజ‌మాన్యాన్ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డంతో పాటు నిధులు మ‌ళ్లించిన ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ర‌విప్ర‌కాష్ ను నిన్న యాజ‌మాన్యం సీఈఓగా త‌ప్పించింది. అయినా నిన్న సాయంత్రం అనూహ్యంగా టీవీ9 తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మైన ర‌విప్ర‌కాష్ తాను ఇంకా సీఈఓనే అని నొక్కి మ‌రీ చెప్పారు. దీంతో ఇవాళ సంస్థ డైరెక్ట‌ర్లు స‌మావేశ‌మ‌య్యారు. ర‌విప్ర‌కాష్ పై ఇప్ప‌టికే వేటు వేసినందున కొత్త సీఈఓగా మ‌హేంద్ర మిశ్రాను నియ‌మించారు. ఆయ‌న ప్ర‌స్తుతం టీవీ9 క‌న్నడ ఎడిట‌ర్‌, సీఈఓగా ఉన్నారు. ర‌విప్ర‌కాష్ స్థానంలో ఆయ‌న రానున్నారు. ఇక‌, టీవీ9 సీఓఓగా గొట్టిపాటి సింగారావును యాజ‌మాన్యం నియ‌మించింది.

Tags:    

Similar News