ఉద్ధవ్ కు పవార్ ఫోన్

శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఫోన్ చేశారు. రాత్రికి రాత్రి మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు మారడంపై ఆయన చర్చించారు. అజిత్ పవార్ [more]

Update: 2019-11-23 04:16 GMT

శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఫోన్ చేశారు. రాత్రికి రాత్రి మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు మారడంపై ఆయన చర్చించారు. అజిత్ పవార్ నిర్ణయానికి ఎన్సీపీ మద్దతు లేదని తెలిపారు. అది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఇది ఎన్సీపీ నిర్ణయం కాదన్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాలపై శివసేన కూడా స్పందించింది. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ అజిత్ పవార్ ను బీజేపీ బెదిరించి లొంగదీసుకుందన్నారు. ఎన్నికలకు ముందే శరద్ పవార్ ను బీజేపీ కేసుల పేరుతో బెదిరించిందన్నారు. అజిత్ పవార్ హావభావాలను చూస్తేనే అర్థమవుతుందని తెలిపారు. అర్దరాత్రి బీజేపీ రాజకీయ వ్యభిచారం చేసిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News