జగన్ ను నమ్మొద్దు....!

Update: 2018-07-26 11:04 GMT

తన కష్టార్జితంతోనే ప్రపంచం మొత్తం తిరిగి హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన నగరదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించేవరకు పోరాడతానని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో కేంద్రం అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. దగాపడ్డ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా చేసేవరకు, ప్రజలకు ఉజ్వల భవిష్యత్ సాధించేవరకు తాను కష్టపడతానన్నారు. అన్నింట్లో రాష్ట్రం ముందుంటుందన్నారు.

కష్టంతో ముందుకు వెళ్లి.....

ఒకప్పుడు దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకునేవారని, టెక్నాలజీని అమలులోకి తీసుకువచ్చి అక్రమాలను కట్టడి చేశానన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా అభివృద్ధి, సంక్షేమం ఆగే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. తెలివి, కష్టంతో ముందుకుపోయి అన్నింట్లో మొదటి స్థానంలో నిలుస్తున్నామన్నారు. కానీ, కేంద్రంతో కుమ్మక్కై జగన్, పవన్ తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్ మాటలను ఎవరూ నమ్మవద్దని చంద్రబాబు కోరారు.

Similar News