ఆత్మ విశ్వాసంతో ముందుకెళదాం… విజయం సాధిద్దాం

భారత్ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయినా భారత్ ధైర్యంతో ముందుకు సాగుతుందని చెప్పారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన మోదీ జాతినుద్దేశించి [more]

Update: 2020-08-15 03:30 GMT

భారత్ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయినా భారత్ ధైర్యంతో ముందుకు సాగుతుందని చెప్పారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం దేశాన్ని కరోనాతో పాటు వరదలు కూడా చుట్టుముట్టాయన్నారు. వీటిని అధిగమించి త్వరలోనే భారత్ బయటపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ భద్రత కోసం కృషి చేస్తున్న సైనికులు, పోలీసులకు వందనాలు తెలియజేస్తున్నాన్నారు. ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్ర్యమని తెలిపారు. భారత స్వతంత్ర సంగ్రామం ప్రపంచానికే దిక్సూచీగా నిలిచిందన్నారు మోదీ. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

చైనా వస్తువులను నిషేధించాల్సిందే….

కరోనా మనకు ఇబ్బంది కలిగించినా మన కాళ్ల మీద మనం నిలబడేలా చేసిందన్నారు. ప్రస్తుతం మనం అనేక వైద్య పరికరాలను తయారీ చేసుకునే స్థితికి వచ్చామన్నారు. లోకల్ గా తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇకపై మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలన్నారు. యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందన్నారు. కరోనా నుంచి త్వరలోనే బయటపడతామని చెప్పారు. మళ్లీ భారత్ వస్తువులకు పూర్వ వైభవం తీసుకువద్దామన్నారు. చైనా వస్తువల దిగుమతిని పూర్తిగా నిషేధించాలన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ముందుకు వెళదామన్నారు. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల ఉత్పత్తికి పేరు అన్నది మరోసారి నిరూపిద్దామన్నారు. ఎఫ్.డి.ఐలో గత ఏడాది 18 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. ప్రతి గ్రామాన్ని డిజిటల్ ఇండియాలో భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఇప్పటికే లక్షలాది గ్రామాలకు ఫైబర్ నెట్ వర్క్ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. మేకిన్ ఇండియా తో పాటు మేక్ ఫర్ వరల్డ్ నినాదంతో ముందుకు వెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు చక్క బడ్డాయన్నారు. అక్కడ పునర్విభజన ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నేటి నుంచి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభమవుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు.

Tags:    

Similar News