దీపయజ్ఞం దేశంలో ఐక్యత చాటింది

పార్టీ శ్రేణులందరూ కరోనా వైరస్ కట్టడికి ప్రయత్నం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి [more]

Update: 2020-04-06 06:44 GMT

పార్టీ శ్రేణులందరూ కరోనా వైరస్ కట్టడికి ప్రయత్నం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా కట్టడికి కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరారు. కరోనా వైరస్ సందర్భంగా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దీపయజ్ఞం మన ఐకమత్యాన్ని చాటిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల సహకారంతో కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. కరోనాపై యుద్ధంలో మనం విజయం సాధిస్తామని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంట్లో తయారు చేసుకున్న మాస్క్ లను ధరించాలని కోరారు. ఈ సమయం దేశానికి ఛాలెంజ్ అని పేర్కొన్నారు. మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా పై మన పోరాటాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. క్లిష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలో భారత్ ప్రపంచ దేశాలకు చాటిచెప్పిందన్నారు

Tags:    

Similar News