ఏపీ ప్రభుత్వంపై నారా లోకేష్ ఫైర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టారు. కరోనా సమయంలో అందరూ ఉపాధికోల్పోయి [more]

Update: 2020-07-21 06:56 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టారు. కరోనా సమయంలో అందరూ ఉపాధికోల్పోయి జీవనం గడవడమే కష్టంగా మారితే, విద్యుత్తు ఛార్జీలను పెంచి ఏపీ ప్రజల నడ్డిని జగన్ ప్రభుత్వం విరిచిందన్నారు. దీనికితోడు పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పెంచడమేంటని నారా లోకేష్ ప్రశ్నించారు. కరోనా సమయంలో ఛార్జీలను పెంచి పేదల నుంచి దోచుకుంటుందని నారా లోకేష్ దుయ్యబట్టారు.

Tags:    

Similar News