అనంతపురం చేరుకున్న లోకేష్… మరికాసేపట్లో?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం చేరుకున్నారు. ఆయనకు మార్గమధ్యంలోని కర్నూలులో టీడీపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. తాడిపత్రిలోని జేసీ [more]

Update: 2020-06-15 04:41 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం చేరుకున్నారు. ఆయనకు మార్గమధ్యంలోని కర్నూలులో టీడీపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. తాడిపత్రిలోని జేసీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు లోకేష్ అనంతపురం వచ్చారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను నకిలీ ఎన్ఓసీల కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కడప జిల్లా జైలులో ఉన్న వారిని పరామర్శించేందుకు లోకేష్ కు అనుమతి లభించకపోవడంతో ఆయన అనంతపురంలోని జేసీ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Tags:    

Similar News