వాళ్లకు ఇక సినిమా చూపిస్తాం

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి సినిమా చూపిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కోసం [more]

Update: 2019-01-11 10:58 GMT

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి సినిమా చూపిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కోసం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్ మోదీతో కలిసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ మోనార్క్ లో వ్యవహరిస్తూ సీబీఐ, ఆర్బీఐ వంటి అత్యున్నత వ్యవస్థలను సైతం బ్రష్టు పట్టించారని ఆరోపించారు. నరేంద్ర మోదీని జగన్ ఒక్కమాట కూడా ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News