మైనారిటీలకు బాబు భారీ వరాలు

Update: 2018-08-28 13:59 GMT

భారతీయ జనతా పార్టీతో తెగదెంపుల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీలను తనవైపు తిప్పుకుంనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గుంటూరులో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘నారా హమారా - టీడీపీ హమారా’ పేరుతో ముస్లింల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిపి మైనారిటీకి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు.

కేంద్రంపై మండిపాటు....

త్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రం తీరు సరైనది కాదని ఆయన విమర్శించారు. ముస్లిం అమ్మాయిల వివాహాలకు అండగా ఉండేందుకు దుల్హాన్ పథకం ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. రంజాన్ కు తోఫా ఇస్తున్నామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అని ఆయన పేర్కొన్నారు. సభకు చంద్రబాబు నాయుడు సంప్రదాయ ముస్లిం వేషధారణలో రావడం విశేషం

Similar News