కాసేపట్లో నేతలతో చంద్రబాబు కీలక భేటీ

Update: 2018-10-22 03:37 GMT

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, ప్రచారం వంటి విషయాలపై చర్చించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా ఆహ్వానించారు. ఏ ఏ సీట్లలో పోటీ చేస్తే విజయావకాశాలుంటాయి? ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? వంటి అంశాలను చర్చించనున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు 25 స్థానాలను కోరుతుండగా కాంగ్రెస్ మాత్రం 12 స్థానాలను కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో మ్యానిఫేస్టో పై కూడా ఈ సందర్భంగా విడుదల చేసే అవకాశముంది.

Similar News