రెండు రూపాయల కోసం హత్య

రెండు రూపాయల కోసం ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. కాకినాడలోని వలసపాకలో ఈ దారుణం చోటు చేసుకుంది. సైకిల్ టైర్ [more]

Update: 2019-11-10 03:22 GMT

రెండు రూపాయల కోసం ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. కాకినాడలోని వలసపాకలో ఈ దారుణం చోటు చేసుకుంది. సైకిల్ టైర్ కు గాలి కొట్టే విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. సైకిల్ టైర్ కు గాలికొట్టి డబ్బులు అడిగినందుకు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సైకిల్ షాపు యజమాని స్నేహితుడు అప్పారావు సైకిల్ యజమాని సువర్ణరాజును కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన సువర్ణరాజు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు రూపాయల కోసం హత్య జరగడం సంచలనంగా మారింది.

Tags:    

Similar News