కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన ములాయం

కాంగ్రెస్ పార్టీకి స‌మాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాద‌వ్ భారీ షాకిచ్చారు. మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోడీనే కావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. పార్ల‌మెంటు చివ‌రి రోజు [more]

Update: 2019-02-13 11:23 GMT

కాంగ్రెస్ పార్టీకి స‌మాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాద‌వ్ భారీ షాకిచ్చారు. మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోడీనే కావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. పార్ల‌మెంటు చివ‌రి రోజు ఆయ‌న అంద‌రి ముందే న‌రేంద్ర మోడీ వ‌ద్ద‌కు వెళ్లి *మ‌రోసారి మీరే ప్ర‌ధాని కావాలి. అన్ని ప‌నుల‌ను చ‌క్క‌బెట్ట‌డంలో, అన్ని పార్టీల‌ను క‌లుపుకొని పోవ‌డంతో మీరు స‌మ‌ర్థులు. మీ వెంటే మేము ఉంటాము* అని వ్యాఖ్యానించారు. దీంతో అక్క‌డున్న వారంతా షాక‌య్యారు. మోడీకి వ్య‌తిరేకంగా ఏర్ప‌డుతున్న మ‌హాకూట‌మిలో స‌మాజ్‌వాదీ కీల‌కంగా ఉంది. తాజాగా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీలో మోడీకి వ్య‌తిరేకంగా చేసిన దీక్ష‌లోనూ పాల్గొన్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News