ముకుల్ రోహత్గీకి ఐదు కోట్లు ఇవ్వడంపై?

అమరావతి రాజధాని అంశంపై వాదనలు విన్పించడానికి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. రాజ్యాంగ [more]

Update: 2020-01-30 03:10 GMT

అమరావతి రాజధాని అంశంపై వాదనలు విన్పించడానికి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాధనాన్ని న్యాయవాది ఫీజు కోసం కేటాయించారంటూ దాఖలయిన ఈ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అమరాతి రాజధాని రైతులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరుపున వాదనలను విన్పించడానికి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని ప్రభుత్వం నియమించింది. ఇందుకోసం ఐదుకోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.

Tags:    

Similar News