జగన్, పవన్ కలిస్తే చంద్రబాబుకు డిపాజిట్ గల్లంతేనా?

Update: 2018-05-28 09:07 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో జగన్, పవన్ ఏకమైతే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు. జగన్, పవన్ ఇద్దరూ మొగాళ్లు కాబట్టి స్వంతంగా పార్టీని, జెండాను పెట్టుకున్నారని, కానీ చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ నుంచి జెండాను, పార్టీని దొంగతనం చేశారని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు ఒక దొంగ అన్నారు. వంచన, మోసానికి చంద్రబాబు మారుపేరని, ఆయనను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవపరమైతే ఏపీలో రథయాత్ర నిర్వహిస్తానని పేర్కొన్నారు.

నీ అనుభవం ఎందుకు...?

గతంలో దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు మొదలు ఇప్పుడు నరేంద్ర మోదీ వరకు చంద్రబాబు నాయుడు అందరినీ అవసరానికి వాడుకుని వదిలేశాడని, మోసం చేశాడని అన్నారు. 2009 నుంచి 2013 వరకు తెలంగాణ ఉద్యమం సమయంలో తాను లేకపోతే టీ, టిఫిన్ కూడా చేయలేదని, నిద్రపోలేదని, అటువంటిది చంద్రబాబు ఇవాళ తనను అవమానిస్తున్నారన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా కావాలో, ప్రత్యేక ప్యాకేజీ కావాలో తేల్చుకోలేని అసమర్థుడని అన్నారు.

Similar News