ఆ సభ అవసరంలేదన్న మోపిదేవి

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే శాసనమండలి అవసరం లేదని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. తాను ఆ సభలో సభ్యుడిని అయినప్పటికీ ఆ సభ అవసరం లేదని తనకు [more]

Update: 2020-01-23 11:07 GMT

రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే శాసనమండలి అవసరం లేదని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. తాను ఆ సభలో సభ్యుడిని అయినప్పటికీ ఆ సభ అవసరం లేదని తనకు అనిపించిందన్నారు. నిన్న జరిగిన పరిణామాలను చూసిన తర్వాత ఇక ఆ సభ ఉంటే ప్రజాసంక్షేమ కార్యక్రమాలు సకాలంలో అమలు చేయడం సాధ్యం కాదన్నారు. రాజకీయ పునరావాసానికి కేంద్రంగా మారిన శాసనమండలిపై సరైన చర్య తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్యాలరీలో ఉన్న చంద్రబాబు కనుసన్నల్లోనే మండలి ఛైర్మన్ పనిచేశారన్నారు.

Tags:    

Similar News