రాహుల్ కు మోడీ ఫోన్ చేసి మరీ...!

Update: 2018-04-27 12:00 GMT

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ తొలిసారి ఫోన్ చేశారు. ఎందుకో తెలుసా? ఈరోజు రాహుల్ కర్ణాటకకు వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయన ఉత్తర కర్ణాటక, మైసూరు ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించేందుకు హుబ్బళ్లి విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే రాహుల్ విమానం దిగుతున్న టైంలోనే ఆటో పైలట్ మోడ్ సరిగా పనిచేయకపోవడంతో ఒక వైపునకు ఒరిగిపోయింది. పెద్ద శబ్దం కూడావచ్చింది. అయితే పైలట్లు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రధాని మోడీ, రాహుల్ గాంధీకి స్వయంగా ఫోన్ చేసి వివరాలను కనుకున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎలా ఉన్నారు? అని రాహుల్ ను మోడీ ప్రశ్నించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై ప్రభుత్వం తేలిగ్గా తీసుకోదని కూడా మోడీ అన్నట్లు స్పష్టం చేశాయి. దీనిపై వెంటనే పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ సంఘటనపై నివేదిక అందినట్లు తెలుస్తోంది.

Similar News