జగన్ కు షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త గౌరు వెంకట్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కార్యకర్తలతో [more]

Update: 2019-02-26 11:03 GMT

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త గౌరు వెంకట్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కార్యకర్తలతో సమావేశమైన వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని వారు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కర్నూలు జిల్లాలో కీలక నేతలుగా ఉన్న గౌరు దంపతులకు పాణ్యం టిక్కెట్ విషయమై వైసీపీ అధినేత జగన్ వద్ద నుంచి హామీ లభించలేదు. ఈ టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News