నారా వారి నరాల్లో ఆ వణుకెందుకు?

దేవాలయాల పై జరిగిన దాడుల్లో టీడీపీ నేతల ప్రమేయం ఉందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతనే ఇది తేలిందన్నారు. టీడీపీ నేతల [more]

Update: 2021-01-16 07:50 GMT

దేవాలయాల పై జరిగిన దాడుల్లో టీడీపీ నేతల ప్రమేయం ఉందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతనే ఇది తేలిందన్నారు. టీడీపీ నేతల పేర్లు బయటకు వస్తుంటే నారా చంద్రబాబు నాయుడు నరాల్లో వణుకు బయలుదేరిందన్నారు. అంత్వర్వేది రధం దగ్గర నుంచి అన్ని ఘటనల్లో టీడీపీ నేతల ప్రమేయం ఉందన్నారు. చంద్రబాబు నీచమైన రాజకీయాల వల్లనే రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ఆలయాలపై దాడులకు చంద్రబాబు ప్రోత్సహించారన్నారు. ఇప్పుడు వారి పేర్లు బయటకు వస్తుంటే తమపై ఎదురుదాడికి దిగుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

Tags:    

Similar News