చంద్రబాబు పైశాచికానందాన్ని పొందుతున్నారు

చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని మానుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. చంద్రబాబు కనీసం అవగాహన లేకుండా [more]

Update: 2020-04-18 12:53 GMT

చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని మానుకోవాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. చంద్రబాబు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. క్వారంటైన్ లో సరైన సదుపాయాలు లేవని విమర్శిస్తున్నారని, ఒక్క టీడీపీ నేత అయినా క్వారంటైన్ ను సందర్శించారా? అని ఆళ్ల నాని ప్రశ్నించారు. అక్కడ కూర్చుని ప్రశ్నించడం కాదని, క్షేత్రస్థాయిలో తమ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసుకుంటే బాగుంటుందని సూచించారు. ఇకనైనా ప్రభుత్వంపై విమర్శలు మానుకుని, సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని చంద్రబాబును ఆళ్లనాని కోరారు.

Tags:    

Similar News