’నో నిజం’ అదే జగనిజం

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పప్పులే ఉడకడం లేదని, మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలోకి వెళ్లి ఏం చేస్తాడని మంత్రి ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. మల్లికార్జున రెడ్డి పార్టీ [more]

Update: 2019-01-22 14:02 GMT

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పప్పులే ఉడకడం లేదని, మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలోకి వెళ్లి ఏం చేస్తాడని మంత్రి ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. మల్లికార్జున రెడ్డి పార్టీ మారడం వల్ల టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదని, రాజంపేటలో మెజారిటీ నేతలంతా టీడీపీలోనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి మేడాకు ఏమీ తెలియదని, జగన్ ఏదీ నిజం చెప్పరన్నారు. ‘నో నిజం’ అనేదే జగనిజం అని ఎద్దేవా చేశారు. పోతూపోతూ టీడీపీపై బుదరజల్లడం సరికాదని హితవు పలికారు. కేసీఆర్ పాలన కంటే చంద్రబాబు పాలన బాగున్నందున, కేసీఆర్ కి వచ్చిన ఓట్లు, సీట్ల కంటే ఏపీలో టీడీపీకి ఎక్కువ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News