అన్నింటిపైనా చర్చకు పార్లమెంటులో పట్టుబడతాం

ముఖ్యమైన అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చకు పట్టుబడతామని వైసీపీ లోక్ సభపక్ష నేత మిధున్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీస్తామన్నారు. ముఖ్యంగా జీఎస్టీ [more]

Update: 2020-09-14 02:41 GMT

ముఖ్యమైన అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చకు పట్టుబడతామని వైసీపీ లోక్ సభపక్ష నేత మిధున్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీస్తామన్నారు. ముఖ్యంగా జీఎస్టీ పరిహారం పంపిణీపై చర్చకు పట్టుబట్టనున్నట్లు మిధున్ రెడ్డి తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు, పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, కరోనా పరిస్థితులపై కూడా తాము చర్చకు పట్టుబడతామని మిధున్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని మిధున్ రెడ్డి తెలిపారు. కాగా నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News