Chiranjeevi : బ్రదర్స్ విడివిడిగానే పర్యటనలు

తూర్పు గోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ పర్యటన ఉత్కంఠను రేపుతుంది. చిరంజీవి, పవన్ కల్యాణ‌్ రోజు తేడాలో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 2వ తేదీన పవన్ [more]

Update: 2021-09-30 04:40 GMT

తూర్పు గోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ పర్యటన ఉత్కంఠను రేపుతుంది. చిరంజీవి, పవన్ కల్యాణ‌్ రోజు తేడాలో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 2వ తేదీన పవన్ కల్యాణ‌్ తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పిలుపునిచ్చిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్బోబరు 2వ తేదీన పవన్ కల్యాణ్ రాజమండ్రిలో రోడ్డు మరమ్మత్తుల కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి రేపు రాజమండ్రికి రానున్నారు. అక్కడ ప్రభుత్వ హోమియో పతి వైద్య కళాశాలలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించనున్నారు. శుక్ర, శనివారాల్లో మెగా బ్రదర్స్ పర్యటన రాజమండ్రిలో ఉండటంతో ఫ్యాన్స్ పెద్దయెత్తున తరలివచ్చే అవకాశముంది. దీంతో పోలీసులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News