మమత vs మజ్లిస్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో మమత బెనర్జీ ఎంఐఎం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం కొందరి దగ్గర డబ్బులు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందని మమత [more]

Update: 2019-11-19 07:47 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో మమత బెనర్జీ ఎంఐఎం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం కొందరి దగ్గర డబ్బులు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందని మమత బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లోనూ ఎంఐఎం పోటీ చేయాలని చూస్తుందని, ఎంఐఎం వలలో ముస్లింలు ఎవరూ చిక్కుకోవద్దని మమత బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీకి బీ టీంగా ఎంఐఎం వ్యవహరిస్తుందని మమత బెనర్జీ ధ్వజమెత్తారు. అయితే మమత బెనర్జీ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మమత భయంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అందుకు ఆధారాలేమైనా ఉన్నాయా? అన్ని ప్రశ్నించారు. బెంగాల్ లో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. బెంగాల్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఒవైసీ చెప్పారు.

Tags:    

Similar News