కుటుంబ కలహాలు.. ఇద్దరు బిడ్డలతో కలసి?

శామీర్ పేట్ మండలం మజీత్ పూర్ ప్రజా హోమ్స్ లో గత రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలకు పురుగుల మందు యిచ్చి తను హాత్మహత్య కు [more]

Update: 2020-05-23 07:00 GMT

శామీర్ పేట్ మండలం మజీత్ పూర్ ప్రజా హోమ్స్ లో గత రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలకు పురుగుల మందు యిచ్చి తను హాత్మహత్య కు పాల్పడ్డ ప్రీతి సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ లో చికిత్సపొందుతూ రాత్రి తుది శ్వాస విడిసింది. మేడ్చల్ జిల్లా షామీర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య చెలరేగిన వివాదాలు ఇద్దరు చిన్నారులను బలికొన్న ఘటన మేడ్చల్ జిల్లా షామీర్ పేట పోలీస్ స్టేషన పరిధిలో చోటు చేరుకుంది.గోపీనాథ్ ప్రీతి అనే దంపతులు షామీర్ పేట లోని మజీద్ పూర్ లో గత కొంత కాలంగా జీవనం కొనసాగిస్తున్నారు. ప్రీతి తల్లి తండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో వరంగల్ లోని ఒక అనాధ ఆశ్రమంలో పెరిగింది. గోపీనాథ్ అనే యువకుడు ప్రీతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొంత కాలం నుంచి భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో ఆమె తరచు తాను పెరిగిన అనాధ ఆశ్రమానికి వెళ్ళేది. భార్య భర్తల మధ్య తరచు గొడవ రావడంతో ప్రీతి తీవ్రంగా మనస్తాపానికి గురైంది. ఇదే క్రమంలో సాయంత్రం 4 గంటల సమయంలో తన తన కుమారులైన గౌరవ ,కౌశిక్ లు ఇద్దరికి విషం ఇచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడింది, దీనితో తల్లి బిడ్డలకు చికిత్సా నిమిత్తం మేడ్చల్ లోని లీలా హాస్పిటల్ లో చేర్చారు.చికిత్సా పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందగా తల్లి ప్రీతి ఈరోజు తుది శ్వాస విడిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News