భవిష్య వాణిలో అమ్మవారి ఆగ్రహం

Update: 2018-07-30 06:07 GMT

లష్కర్ మహాంకాళి బొనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సోమవారం అమ్మవారి రంగం కార్య్రకమం ఘనంగా జరిగింది. స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. ‘‘పుట్టెడు దుఃఖం తో భక్తులు నా దగ్గరికి వస్తున్నారు. బంగారు బోనంతో ఆనందపర్చాలని అనుకోవడం మీ మూర్కత్వమే. నా బిడ్డలు, ఆడపడుచులు చాలా కష్టాలు పడుతున్నారు. ఆడపిల్లలు అందరు శోకిస్తున్నారు. ఈ సంవత్సరం అంతగా ఆనందపరిచే విధంగా ఏమీలేదు. ఎంతో మంది‌ సిబ్బంది ఉన్నా కూడా లాభాం లేదు. మీరు ఎంత ఇబ్బందులు పెట్టినా నా భక్తులకు సుఖసంతోషం తెవడం నాకు ముఖ్యం. కోరింది కొంగు బంగారం చేస్తా...నా భక్తులకు మీరు మంచి చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ కీడు ఎక్కువ చేస్తున్నారు. నా బిడ్డలను నేనే రక్షిస్తా, అలాగే దుష్టులని శిక్షిస్తా...సమృద్ధిగా ఈసారి వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. కుల మత బేధం లేకుండా నా దగ్గరికి వచ్చే భక్తులను సమానంగా ఆశీర్వదిస్తా. తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తా’’ అని జోగిని సర్ణలత భవిష్యవాణిని విన్పించారు.

Similar News